2021 సంవత్సరంలో అక్కినేని అభిమానులకు సమంత నాగచైతన్య భారీ షాక్ ఇచ్చారనే సంగతి తెలిసిందే.సమంత చైతన్య విడిపోతున్నట్టు చేసిన ప్రకటనను అభిమానులు తేలికగా మరిచిపోలేరు.
ఎందుకు విడిపోయారనే విషయాన్ని చైతన్య సమంత వెల్లడించకపోయినా వీళ్లిద్దరూ విడిపోవడానికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.విడాకుల ప్రకటన తర్వాత సమంత కెరీర్ పరంగా బిజీ అయ్యారు.
పుష్ప ది రైజ్ లో సమంత స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వచ్చాయి.పుష్ప ది రూల్ లో కూడా సమంత కనిపిస్తారని ప్రచారం జరుగుతున్నా మేకర్స్ నుంచి ఈ ప్రచారానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.
రానా భార్య మిహికా బజాజ్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా సమంత ఆ ఫోటోల గురించి స్పందిస్తూ నీ అవుట్ ఫిట్ నాకు నచ్చిందంటూ కామెంట్లు చేశారు.
ఆ కామెంట్ కు మిహికా బజాజ్ థాంక్యూ అని రిప్లై ఇవ్వగా సమంత చేసిన కామెంట్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
నాగచైతన్యతో విడిపోయినా సమంత దగ్గుబాటి ఫ్యామిలీతో సన్నిహితంగా మెలగడం గమనార్హం.వెంకటేష్ కూతురుతో కూడా సమంత స్నేహపూర్వకంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో కూడా సమంత అఖిల్, నాగార్జునలను ఫాలో అవుతున్నారు.సమంత నటించిన కణ్మణి రాంబో ఖతీజా ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కగా విజయ్ సేతుపతి, నయనతార ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో నయనతార, సమంత మధ్య స్నేహ బంధం మరింత బలపడిందని తెలుస్తోంది.తాజాగా నయనతార సమంత కోసం ఖరీదైన బహుమతిని పంపగా అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.