పని ఇచ్చి జీతం ఇచ్చే సెలూన్ యజమానిని అత్యంత దారుణంగా పనివాడు హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో( Kukatpally ) చోటు చేసుకుంది.పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఈ నిజం వెలుగులోకి వచ్చింది.
అసలు పనివాడు యజమానిని హత్య చేయడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కూకట్ పల్లిలో అశోక్( Ashok ) అనే వ్యక్తి ఓ సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు.అశోక్ వద్ద బీహార్ కు చెందిన పంకజ్ అనే యువకుడు పని చేస్తున్నాడు.
పంకజ్ కేవలం నాలుగు నెలల క్రితమే అశోక్ వద్ద పనిలో చేరాడు.పంకజ్( Pankaj ) తరచుగా వ్యాపారాన్ని మళ్లిస్తూ ఇంటి వద్ద కొనసాగిస్తూ ఉండడంతో యజమాని అశోక్ అతన్ని కాస్త మందలించాడు.ఈ విషయం మనసులో పెట్టుకున్న పంకజ్ యజమానిపై పగను పెంచుకొని బీహార్ కు ( Bihar ) చెందిన ఐదు మందితో కలిసి ఆదివారం సాయంత్రం సెలూన్ కు( Salon ) వెళ్లాడు.అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అశోక్ స్పందించలేదు.
వెంటనే అశోక్ కుమారుడు సెలూన్ వద్దకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో అశోక్ పడి ఉన్నాడు.దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది హత్య అని తేల్చారు.పంకజ్ తన తోటి వారితో కలిసి ప్లాన్ ప్రకారమే యజమానిని హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసులు పంకజ్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
రెండు లేదా మూడు రోజుల్లోనే హత్యకు సంబంధించిన అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.