టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి తన నటనతో యావత్ ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన మొదటి సినిమా లీడర్.
ఈ సినిమాతోనే ఈయన దగ్గుబాటి వారసుడిగా మొదటిసారి వెండి తెరకు పరిచయామ్ అయ్యాడు.అప్పుడు స్టార్ట్ అయినా రానా జర్నీ ఇప్పటికే అలాగే కొనసాగుతుంది.
ఈయన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విభిన్నమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.
ఈయన ఏ సినిమాలో నటించిన ఆయన పాత్రకు మంచి గుర్తింపు రావడమే కాకూండా ఈయనకు ఇమేజ్ పెరుగుతుంది.
ఇక దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుని స్టార్ట్ నటుడిగా పిలిపించు కుంటున్నాడు.ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాలో రానా విలన్ గా నటించి హీరో పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ ఇచ్చాడు.ఇక ఇప్పుడు రానా నటించిన విరాట పర్వం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈ సినిమాను వేణు ఉడుగుల డైరెక్ట్ చేసారు.
కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ చేయకుండా ఆపారు.
అయితే ఇన్ని రోజులకు ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో రానా కు జోడీగా సాయి పల్లవి నటించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.నక్సల్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
మరి ఆ ఎదురు చూపులు ఫలించి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చెప్పనున్నట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.
మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాల్సిందే.