యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
అయతే ఈ సినిమా ఇంకా పూర్తిగాక ముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటించేందుకు ప్రభాస్ పచ్చ జెండా ఊపేశాడు.ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ రెండు సినిమాల భవిష్యత్తు మాత్రం రాధేశ్యామ్ చిత్రంపై ఆధారపడి ఉందని చెప్పాలి.
రాధేశ్యామ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటే ఆ రెండు చిత్రాలు కూడా అత్యంత భారీ అంచనాలను క్రియేట్ చేయగలుగుతాయి.
కానీ రాధేశ్యామ్ చిత్రం ఏమాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం రెండు చిత్రాలపై భారీగా ఉండనుంది.అత్యంత భారీ బడ్జెట్తో ఆ రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి.
ఇలాంటి సమయంలో రాధేశ్యామ్ తేడా కొడితే ప్రభాస్పై అంత భారీ బడ్జెట్ను పెట్టడం రిస్కే అవుతుందని ఆయా చిత్రాల నిర్మాతలు భావిస్తున్నారు.అందుకే ఎట్టిపరిస్థితుల్లో కూడా రాధేశ్యామ్ చిత్రం హిట్ కొట్టి తీరాలని వారు కోరుతున్నారు.
మరి రాధేశ్యామ్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.