కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి చెందిన తర్వాత ఆయన్ని సైమా అవార్డ్ వరించింది.ఆయన యువరత్న సినిమా తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమా పునీత్ రాజ్ కుమార్ బతికుండగా వచ్చిన సినిమా ల్లో చివరి సినిమా గా నిలిచింది.పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఆయన నటించి జేమ్స్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమా పూర్తి చేయకుండానే పునీత్ రాజ్ కుమార్ చనిపోయాడు.పునీత్ రాజ్ కుమార్ యువరత్న సినిమా లో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను కన్నడ బెస్ట్ హీరో గా నిలిచాడు.
పునీత్ రాజకుమార్ మృతి చెందిన తర్వాత సైమా అవార్డు రావడం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.రాజ్ కుమార్ ఫ్యామిలీ అభిమానులు ఇప్పుడు చాలా సంతోషం గా సైమా అవార్డు వేడుకను ఆస్వాదిస్తున్నారు.
పునీత్ రాజ్ కుమార్ తరపున అన్నయ్య శివరాజ్ కుమార్ సైమా అవార్డు ని అందుకున్నాడు.యువ రత్న సినిమా కన్నడం లోనే కాకుండా తెలుగు లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
భారీ వసూలను సొంతం చేసుకున్న యువరత్న సినిమా లో పునీత్ రాజ్ కుమార్ నటన చాలా మందికి ఆదర్శం గా నిలిచింది అనడం లో సందేహం లేదు.ఆయన పాత్ర కూడా చాలా విభిన్నం గా ఉంటుంది అని సినిమా విడుదల సమయం లో రివ్యూలు వచ్చాయి.
పాత్ర కు తగ్గట్లుగా పునీత్ రాజ్ కుమార్ తన బాడీ లాంగ్వేజ్ ని మార్చు కోవడం తోపాటు పూర్తిగా అందుకు తగ్గట్లుగా మారిపోయి నటించాడు.అందుకే సినిమా సక్సెస్ అయ్యింది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది అందుకు గాను తాజాగా ఆయన కు సైమా అవార్డు దక్కింది.
తెలుగు లో ఉత్తమ హీరో గా సైమా అవార్డు ను అల్లు అర్జున్ దక్కించుకున్న విషయం తెల్సిందే.