ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ మేరకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు.
ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ పాల్గొననున్నారు.మరోవైపు పొత్తు నేపథ్యంలో బీసీ ఆత్మగౌరవ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
ఈ క్రమంలోనే సభా వేదికపై నుంచి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.మోదీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ సభా ఏర్పాట్లను పూర్తి చేసింది.
అదేవిధంగా సభకు భారీగా జనసమీకరణ చేసిందని తెలుస్తోంది.