ఏపీ అసెంబ్లీలో అధికార పక్ష నేతలు, ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించాయి.అసెంబ్లీ నుండి వాకవుట్ చేయడమే కాదు మళ్లీ వస్తే సి.
ఎం గానే అంటూ శపధం చేశారు చంద్రబాబు.అంతేకాదు రాజకీయాలు జోక్యం చేసుకోని భువనేశ్వరి గురించి మాట్లాడినందుకు చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ విషయంపై నందమూరి ఫ్యామిలీ స్పందించిన విషయం తెలిసిందే.ఇదే విషయంపై రాజకీయాల్లోకి ఆడపడుచులను లాగడం అరాచక సంస్కృతి అని ఎన్.టి.ఆర్ కూడా స్పందించారు.
తారక్ స్పందన మీద విలక్షణ నటుడు.సోషల్ యాక్టివిస్ట్ ప్రకాష్ రాజ్ స్పందించారు.వెల్ సెడ్ డియర్ అంటూ ఎన్.టి.ఆర్ వీడియోకి కామెంట్ పెట్టారు ప్రకాష్ రాజ్.అయితే టీడీపీ అభిమానులు మాత్రం ఎన్.టి.ఆర్ ఇంకా ఫోర్స్ గా ఈ విషయాన్ని చెప్పాలని అంటున్నారు.ఓ పక్క కళ్యాణ్ రాం, నారా రోహిత్ కూడా ఈ విషయంపై తమ స్పందన తెలియచేశారు. ఎన్.టి.ఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్ లో ఉన్నారు.తిరిగి వచ్చాక మరోసారి ఈ విషయంపై స్పందిస్తారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సినిమాల మీదే ఫోకస్ పెట్టారన్న సంగతి తెలిసిందే.