ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సీట్ల పంచాయతీ కొనసాగుతోంది.ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీకానుంది.
ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కమిటీ చర్చించనుంది.ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని నియోజకవర్గాల అభ్యర్థులపై నేతలు చర్చించే అవకాశం ఉంది.
అదేవిధంగా వామపక్షాలకు కేటాయించే స్థానాలపైనా కసరత్తు కొనసాగుతోంది.అలాగే రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.
ఈ క్రమంలోనే అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని ఏఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం.
.