అనుష్క హీరోయిన్ గా మాధవన్ హీరోగా రూపొందిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిద్ధమైంది.ఆరు నెలలుగా ఈ సినిమా విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్ కు తెర దించుతూ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
అక్టోబర్ 2వ తారీఖున నిశ్శబ్దం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాపై మొన్నటి వరకు భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతుండటం మరియు పెద్దగా ప్రమోషన్స్ చేయక పోవడం వల్ల అంచనాలు తగ్గుతున్నాయి.
అనుష్క ఈ సినిమాలో మూగ చెవిటి అమ్మాయి గా కనిపించబోతుంది.
అంజలి మరియు శాలిని పాండే లు కూడా ఈ సినిమాలో నటించడం మాధవన్ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న కారణంగా అందరు మొదటి నుండి చాలా ఆసక్తి పెంచుకున్నారు.థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ థియేటర్లు ఇంకా ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కనుక ఓటీటీ ద్వారా విడుదలకు రెడీ అయ్యారు.
సాధారణంగా అయితే థియేటర్లలో విడుదలకు అనగానే చిత్రంలో నటించిన నటీనటులు ప్రమోషన్ కు ఆసక్తి చూపిస్తారు.కాని ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదు.అమెజాన్ వారు భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేసినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం పెద్దగా సహకరించడం లేదు అని టాకు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన నిశ్శబ్దం సినిమా మంచి ప్రమోషన్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది.
కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం కరోనా పేరు చెప్పి ప్రమోషన్ కు హాజరు తప్పించుకుంటున్నారు.దాంతో అమెజాన్ వాళ్ళు చిత్ర యూనిట్ సభ్యుల పై అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాను హేమంత్ మధుకర్ తెరకెక్కించగా కోన వెంకట్ రచన సహకారం అందించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారు.అనుష్క ఈ సినిమాలో జాతీయ అవార్డు అందుకుంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు.
అవార్డ్ ల సంగతి తర్వాత గాని సినిమా విడుదలకు మొదట ప్రమోషన్ కి హాజరు కావాలంటూ అమెజాన్ వారు చిత్ర యూనిట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు.మరి లాస్ట్ రెండు మూడు రోజుల్లో ఆయిన చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఒకచోట చేరి ప్రమోషన్ కి సహకరిస్తారా లేదా అనేది చూడాలి.