సినిమా రంగంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జోడీలు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి.ఈ విధంగా విడిపోవడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి.
అయితే మహేష్ నమ్రత మధ్య గొడవలు జరిగినట్టు కూడా ఎప్పుడూ వార్తలు ప్రచారంలోకి రాలేదు.పెళ్లై 17 సంవత్సరాలు అవుతున్నా ఈ జోడీ అన్యోన్యంగానే జీవనం సాగిస్తున్నారు.
ఈ జోడీ తమ గురించి ఇతరులు విమర్శలు చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే మాత్రమే వివాహ బంధం సజావుగా సాగుతుందని అన్నారు.
మహేష్ తో పెళ్లి జరిగి 17 సంవత్సరాలు అయిందని పెళ్లికి ముందు మేము మంచి ఫ్రెండ్స్ కాగా పెళ్లి తర్వాత అన్ని విషయాలను ఒకరికొకరు పంచుకునే వాళ్లమని నమ్రత కామెంట్లు చేశారు.
మా ఇద్దరి మధ్య అనుమానాలకు, రహస్యాలకు, అపార్థాలకు చోటు లేదని ఆమె వెల్లడించారు.
మహేష్ బయటకు వెళ్తే పదిసార్లు ఫోన్ చేసి నేను విసిగించనని ఆమె కామెంట్లు చేశారు.మహేష్ కూడా నా విషయంలో అదే విధంగా వ్యవహరిస్తాడని నమ్రత పేర్కొన్నారు.
గౌతమ్ సితార పుట్టిన తర్వాత మా లైఫ్ ఎంతగానో మారిపోయిందని ఆమె కామెంట్లు చేశారు.గౌతమ్ కు హార్ట్ బీట్ సరిగ్గా లేదని వైద్యులు చెప్పడంతో చాలా టెన్షన్ పడ్డామని నమ్రత వెల్లడించారు.
గౌతమ్ పుట్టిన సమయంలో గౌతమ్ బరువు కేజిన్నర మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.ప్రతిరోజూ గౌతమ్ 10 గ్రాముల బరువు పెరగాలని వైద్యులు సూచించారని ఆమె కామెంట్లు చేశారు.ప్రతిరోజూ గౌతమ్ బరువు పెరగాలని దేవుడ్ని కోరుకునేవాళ్లమని నమ్రత వెల్లడించారు.మహేష్ భార్య నమ్రత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.