ఐపీఎల్ లో తాజాగా ముంబై – గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ ను 27 పరుగుల తేడాతో చిత్తుచేసి ముంబై( Mumbai Indians ) ఘన విజయం సాధించింది.మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు లో ప్లేయర్లైన ఇషాన్ కిషన్ 31, రోహిత్ శర్మ 29 పరుగులతో శుభారంభం అందించారు.
తరువాత సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav )గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.బౌండరీల వద్ద పరుగుల వరద పారించాడు.49 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 103 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.విష్ణు వినోద్ 30 పరుగులతో సూర్య కుమార్ కు అండగా నిలిచాడు.
దీంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.
తరువాత లక్ష్య చేధనకు గుజరాత్ జ( Gujarat Titans )ట్టు ఆరంభంలోనే పేలవ ఆట ప్రదర్శన చేసింది.జట్టు ఓపెనర్లు అయినా వృద్ధిమాన్ సాహ 2, శుబ్ మన్ గీల్ 6 పరుగులతో పెవిలియన్ చేరారు.మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాలుగు పరుగులు అభినవ్ మనోహర్ రెండు పరుగులతో ఘోరంగా విఫలమయ్యారు.
తరువాత మిడిల్ ఆర్డర్లో వచ్చిన విజయ శంకర్ 29 పరుగులు, డేవిడ్ మిల్లర్ 46 పరుగులతో కాసేపు క్రీజు లో ఉండి పెవిలియన్ చేరారు.
చివర్లో వచ్చిన రషీద్ ఖాన్ ( Rashid Khan )32 బంతుల్లో 79 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది.రషీద్ ఖాన్ బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా అదరగొట్టాడు ఈ మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసుకోవడం గమనార్హం.
ఇంకొన్ని బంతులు ఉండి ఉంటే రషీద్ ఖాన్ లక్ష్యాన్ని చేదించే అవకాశం ఉండేది.చివరకు గుజరాత్ ఓటమిని చవిచూసింది.
ముంబై జట్టు విజయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.ముందుగా బ్యాటింగ్ చేసిన తమ జట్టు భారీ లక్ష్యాన్ని చేయడం, తర్వాత బౌలింగ్లో వరుస వికెట్లను తీయడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు.
సూర్య కుమార్ గురించి మాట్లాడుతూ అతని కాన్ఫిడెన్స్ ఎలాంటిదో తనకు తెలుసునని, ప్రతి మ్యాచ్ ఫ్రెష్ గా ప్రారంభించి, చివరి మ్యాచ్ గురించి ఆలోచించడని తెలిపాడు.