ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్రాష్ట్రంలో ఉన్న యువతకు హెరాయిన్ సప్లై చేస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు పై స్పందించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన టైంలో బెనాకని కాలు ఢిల్లీ అంటే ఎందుకు బెనికింది అంటూ సెటైర్లు వేశారు.
సీఎం జగన్ ఒక పిరికిపంద అన్న తరహాలో వ్యాఖ్యానించిన ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది అని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించకుండా తాడేపల్లి లో తలదాచుకున్నారు అని విమర్శల వర్షం కురిపించారు.
ఎటువంటి విషయంలోనైనా తెలుగుదేశం పార్టీ ఇష్టానుసారం అయిన మాటలు మాట్లాడద్దని.స్పష్టమైన సమాచారం సాక్ష్యాధారాలతో మాట్లాడుతుంది.ఈ విషయాన్ని ఏపీ డీజీపీ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా నడుస్తోంది.కానీ పోలీసులు ఎవరి కోసం పని చేస్తున్నార .అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.ప్రతిపక్ష పార్టీ మాట్లాడకూడదని డీజీపీ చెప్పడం ఏమిటి అంటూ తనదైన శైలిలో ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శల వర్షం కురిపించారు.పోలీస్ శాఖలో ఉన్నత అధికారులు గా ఉండే డీజీపీలు ఎస్పీలు మరియు కమిషనర్లు ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతుందని పేర్కొన్నారు.
హరేన్ విషయంలో.నిజానిజాలు వెలుగులోకి తీసుకు రావాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.