యూఏఈ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.మతి స్థిమితం లేని తల్లి,కూతురు పై ఒక దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.
అయితే మతి స్థిమితం లేని ఆ కూతురు గర్భం దాల్చడం తో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.దీనితో వారి బంధువులను పోలీసులకు ఫిర్యాదు చేయడం తో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు.
గత కొంత కాలంగా నిందితుడు మతిస్థిమితం లేని తల్లి,కూతురు ఇద్దరినీ అనుసరించి ఆ తరువాత పధకం ప్రకారం ఎవరూ ఇంట్లో లేని సమయంలో వారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.అయితే మతి స్థిమితం లేకపోవడం తో వారికి ఏమి జరుగుతుందో అన్న విషయం కూడా అర్ధం కాకపోవడం తో అతడు పలు మార్లు ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
అయితే కూతురు గర్భం దాల్చడం తో ఆమె బంధువులకు సందేహం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు.దీనితో కేసు రస్ ఆల్ ఖైమా కోర్టుకు వెళ్లడం తో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.