అమెరికాలో చనిపోయిన తెలుగు యువతి కోసం రూ.1 కోటికి పైగా విరాళాలు..

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 23 ఏళ్ల యువతి జనవరి 23న అమెరికాలోని సియాటెల్‌లో పోలీసు కారు ఢీకొని మరణించింది.ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆ యువతి ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం చాలా మందిని బాధించింది.

 More Than Rs. 1 Crore Donations For Telugu Girl Who Died In America , Jaahnavi-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఆ యువతి కుటుంబానికి సహాయం చేయడానికి ప్రజలు ఆన్‌లైన్ నిధుల సేకరణను ఏర్పాటు చేశారు.దాని ద్వారా డబ్బును సేకరించారు.నిధుల సమీకరణ లక్ష్యం 125,000 డాలర్లు లేదా దాదాపు రూ.1 కోటి.అయితే అది లక్ష్యాన్ని అధిగమించి ఐదు రోజుల్లో దాదాపు రూ.1.3 కోట్లు (159,029 డాలర్లు) సమీకరించింది.GoFundMe వెబ్‌సైట్‌లో ఫండ్ రైజింగ్ సెటప్ చేశారు.

కాగా దాదాపు 4,700 విరాళాలు అందాయి.చనిపోయిన యువతి పేరు జాహ్నవి కందుల.ఈ యువతి సియాటెల్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది.ఆమెను ఢీ కొట్టిన పోలీసు అధికారి ఎమర్జెన్సీ కాల్‌ వరకు చాలా స్పీడ్ గా రోడ్డుపై వెళ్తున్నాడు.అదే సమయంలో రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్న జాహ్నవిని బలంగా ఢీకొట్టాడ.ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఈ ప్రమాదంపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.యువతి మరణం పట్ల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

నడిచే ప్రజలకు వీధులను సురక్షితంగా ఉంచాలని కోరుకుంటున్నారు.ఆమె తల్లి విజయలక్ష్మి స్కూల్ టీచర్ గా పని చేస్తున్నారు.యువతికి ఆమె ఒక్కరే సింగిల్ పేరెంట్.స్కూల్ టీచర్ గా పని చేస్తున్న బాధ్యురాలి తల్లికి ఎడ్యుకేషన్ లోన్‌తో పాటు చాలా అప్పులు కట్టాల్సి ఉంది.ఆ ఖర్చుల కోసం ఈ డబ్బును ఆమె వినియోగిస్తారు.బాధ్యురాలికి ఒక సోదరి కూడా ఉంది.

జాహ్నవి 2021 సెప్టెంబర్ నెలలో అమెరికాకి వెళ్ళింది మరో నాలుగు నెలలు అయితే ఆమె చదువు పూర్తయ్యేది.ఉద్యోగం కూడా వచ్చి తల్లికి అండగా ఉండేది కానీ దురదృష్టం వల్ల ఆమె అర్ధంతరంగా కన్ను మూసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube