టాలీవుడ్ నటి,మంత్రి రోజా నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే నేడు ఈమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
నేడు ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో ఈమె స్వామి వారిని దర్శించుకున్నారు.వేద పండితులు మంత్రి గారికి సాదర స్వాగతం పలికారు.
స్వామి వారి దర్శనం అనంతరం ఈమె రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించారు.స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందుకున్న అనంతరం ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ సినిమాల గురించి కూడా మాట్లాడారు.తాను నటనను ఎప్పుడు తప్పు పట్టలేదని,తప్పు పట్టనని తెలిపారు.ఇక తన కూతురు,కొడుకు ఇండస్ట్రీలోకి వస్తే తాను స్వాగతం పలుకుతామని ఈమె తెలిపారు.ప్రస్తుతం తన పిల్లలకి ఆ ఆసక్తి లేదని తెలిపారు.
ఇక మంత్రి అయిన తరువాత ఈమెకు ఇది మొదటి పుట్టిన రోజు కావడంతో ఈమె ఎంతో సంతోషంగా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
ఇక నేడు ఈమె పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక సూపర్ స్టార్ కృష్ణ మరణం గురించి కూడా మాట్లాడుతూ.కృష్ణ గారు చనిపోవడం ఆవేదన కలిగిస్తుందని రోజా అన్నారు.
తాను చిన్నప్పటి నుంచి కృష్ణ గారికి అభిమాని అని ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఈ సందర్భంగా రోజా తెలిపారు.