ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నేతన్న నేస్తం పథకంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.మదనపల్లి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఆప్కోలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందన్న నారా లోకేశ్ మగ్గాలు ఉన్నవారికే నేతన్న నేస్తం అంటున్నారని మండిపడ్డారు.
నేతన్న నేస్తం పథకం పెద్ద మోసమని ఆరోపించారు.టీడీపీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పారు.
అదేవిధంగా చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తామని స్పష్టం చేశారు.