టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి మనందరికీ తెలిసిందే.కీర్తి సురేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
అందులో భాగంగానే గత ఏడాది చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో నటించింది.ప్రస్తుతం సైరన్ అనే సినిమా( Siren Movie )లో నటిస్తోంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది కీర్తి సురేష్.మొదటి నేను శైలజ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే హీరోయిన్గా అనూహ్య స్థాయికి చేరుకుంది.
ఇక మహానటి( Mahanati ) చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది.ప్రస్తుతం ఈమె మలయాళం, తమిళం, తెలుగు భాషలను దాటి ఉత్తరాది ప్రేక్షకులను అలరించడానికి బాలీవుడ్ వరకు చేరుకుంది.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తాను హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.
నేను నా స్నేహితులతో ఒకరోజు అర్ధరాత్రి సమయంలో కలిసి వెళ్తున్నాను.
అప్పుడు ఒక అతను డ్రింక్ చేసి అటుగా వెళుతూ నా వెనుక వైపు తాకాడు.నాకు కోపం వచ్చి వెంటనే అతని చెంపలు వాయించాను.ఆ సమయంలో అతడు నాపై దాడి చేసి తలపై కొట్టాడు.
అనంతరం అతన్ని చితకబాదీ పోలీసులకు అప్పగించాము.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని రాత్రి మొత్తం స్టేషన్ లో పెట్టి ఉదయాన్నే రిలీజ్ చేశారు అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.
ఈ సందర్భంగా కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ గా మారాయి.