మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిపోయిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు.మూడేళ్లలోనే మేడిగడ్డ వంతెన కుంగిపోవడం దారుణమని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారన్న కిషన్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చించారని పేర్కొన్నారు.బ్యారేజ్ కుంగిపోవడం దురదృష్టకరమన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల సంపదకు చిల్లులు వేసిన ప్రాజెక్టు అని విమర్శించారు.
గతంలో గోదావరి వరదలు వచ్చి పంప్ లు మునిగిపోయాయని తెలిపారు.గ్రాఫిక్స్ ను ప్రజల ముందు పెట్టి అద్భుత ప్రాజెక్ట్ అని ప్రచారం చేశారన్నారు.
ప్రతి ఏడాది 400 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి రైతులకు అందిస్తామన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు కాదని తెలిపారు.