బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.ఈ మేరకు కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) విచారించనుంది.

 Inquiry On Bail Petition Of Brs Mlc Kavitha , Delhi Liquor Scam Case, Ed , Rou-TeluguStop.com

తన చిన్న కుమారుడు పరీక్షల నిమిత్తం ఈ నెల 16 వరకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ లో కోర్టును కోరారు.ఈ క్రమంలోనే గత నెల 26న ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో కవిత తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు.

అయితే కవితకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ ను ఈడీ( ED ) వ్యతిరేకిస్తుంది.కవిత బెయిల్ పై బయటకు వస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ పేర్కొంది.సాక్షులను, ఆధారాలను ఆమె ప్రభావితం చేస్తారని ఈడీ ఆరోపిస్తుంది.

కాగా ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube