ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది.
ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.
ఈ క్రమంలో కారు అద్దాలను పగులగొట్టి రిషబ్ బయటపడ్డారు.అయితే రిషబ్ పంత్ తలకు, మెకాలు, వీపు భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ లోని ఆస్పత్రికి తరలించారు.
అయితే నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.