అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు వెస్లీ మాద్యూస్ కి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది.కన్నా కూతురిని చంపినందుకు గాను అతడికి అమెరికా కోర్టు ఈ శిక్ష విధించింది.2017 లో జరిగిన ఈ ఘటనపై స్థానిక కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది.అయితే అతడు తన కూరుతుని ఎందుకు చంపవలసి వచ్చింది.
అసలు ఆ ఘటన జరిగిన రోజు ఏమి జరిగింది అనే వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని టెక్సాస్ లో స్థిరపడిన కేరళాకి చెందిన వెస్లీ మాథ్యూ స్, సినీ అనే దంపతులు బీహార్లోని నలంద జిల్లాలో ఉన్న ఓ అనాథాశ్రమం నుంచీ షెరీన్ అనే పాపని దత్తతు తీసుకున్నారు.2017 అక్టోబర్ 7న షెరిన్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడుతండ్రి వెస్లీ.అయితే పాలు తాగడం లేదని పాపా మారం చేస్తుంటే ఉదయం 3 గంటల సమయంలో ఇంటికి బయట నిలబెట్టానని 10 నిమిషాల తరువాత చూస్తే పాప కనపడలేదని తెలిపాడు.
దాంతో గాలింపు చేపట్టిన పోలీసులకి 15 తరువాత ఓ కల్వర్టు కింది పాప మృతదేహం కనిపించింది.ఈ క్రమంలో ఛాలెంజ్ గా ఈ కేసుని తీసుకున్న పోలీసులు తమ దర్యాప్తులో పాపని హత్య చేసింది తండ్రే నాని తెలుసుకుని అతడిని తమదైన శైలిలో విచారించగా నిజాన్ని అంగీకరించాడు.ఈ ఘటనపై స్పందించిన కోర్టు సాక్ష్యా ధారాల్ని పరిశీలించి వెస్లీ కి 30 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.