తాజాగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి భారత్ ఫైనల్ కు చేరింది.కుల్దీప్ యాదవ్( Kuldeep Yadav ) తన స్పిన్ మాయాజాలంతో కీలక సమయాలలో ఏకంగా నాలుగు వికెట్లు తీసి శ్రీలంక పతనానికి కీలక పాత్ర పోషించాడు.
దీంతో భారత్ 41 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది.భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) 53, కేఎల్ రాహుల్ 39, ఇషాన్ కిషన్( Ishan Kishan ) 33, అక్షర్ పటేల్ 26, శుబ్ మన్ గిల్ 19 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన శ్రీలంక జట్టును భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేయడం ప్రారంభించారు.శ్రీలంక జట్టు 42 ఓవర్లలో కేవలం 172 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.కుల్దీప్ యాదవ్ ఏకంగా నాలుగు వికెట్లు తీసి శ్రీలంక ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.మిగతా భారత జట్టు బౌలర్లైన బుమ్రా 2, రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) 2 వికెట్లు తీయగా.
మహమ్మద్ సిరాజ్ 1, హార్థిక్ పాండ్యా 1 వికెట్ తీసుకున్నారు.
భారత జట్టు సూపర్-4 స్టేజిలో ఆడిన రెండు మ్యాచ్లలోనూ భారీ విజయాలు సాధించింది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై 228 పరుగుల తేడాతో గెలిచింది.శ్రీలంకపై 41 పరుగుల తేడాతో గెలిచింది.
దీంతో గ్రూప్ ఫోర్ స్టేజ్ లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఫైనల్ కు చేరింది.శ్రీలంక, పాకిస్తాన్ జట్లు చెరో రెండు పాయింట్లు ఉన్నాయి.
అయితే పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ లో భారత్ తో తలపడనుంది.