ఈ రోజుల్లో ట్రైన్( Train ) వస్తుండగా పట్టాలపై ఉరకడం దాటడం లేదంటే సెల్ఫీలు తీసుకోవడం కామన్ అయిపోయింది.ఈ క్రమంలో ట్రైన్ వేగాన్ని, రాకను ఊహించని కొందరు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
సెల్ఫీలంటూ రైల్వే ట్రాక్లపై నిల్చడం ఒక ట్రెండ్ గా మారింది.ఇలాంటి వారిలో కొంతమందిని ఇప్పటికే ట్రైన్ ఢీ కొట్టడంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఇక ఈ రోజుల్లో ట్రైన్ వస్తుండగానే రైల్వే పట్టాలు దాటి వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.
తాజాగా పాకిస్థాన్లో( Pakistan ) ఒక వ్యక్తి రైల్వే పట్టాలు దాటుదాం అనుకున్నాడు కానీ అప్పటికే ఆ పట్టాలపై ట్రైన్ చాలా వేగంగా వస్తోంది.అది వచ్చే లేపు ఇతడు పట్టాలు క్రాస్ అవ్వాలనుకున్నాడు.కానీ రైలు బంపర్ చివర భాగం అతడికి బలంగా తగిలింది.
అంతే చాలా ఎత్తుకు ఎగిరి కింద పడ్డాడు.ఆ స్ట్రాంగ్ డ్యాష్ వల్ల అతడు చనిపోయే ఉంటాడని తెలుస్తోంది.
చాలా బలంగా అతడికి క్రష్ ఇచ్చినట్లు వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం అర్థమవుతుంది.
ఈ వీడియోను చీటింగ్ డెత్( Cheating death ) అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది దీనికి ఇప్పటికే 32 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.2 సెకండ్ల నెటిజన్లు ఉన్న ఈ వీడియోను చూసి చాలామంది షాక్ అవుతున్నారు.ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తిస్తారు? అనవసరంగా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటారు? కన్నవారికి లేదా భార్యా పిల్లలకు ఎంత బాధ మిగుల్చుతున్నారో వీరు చచ్చాకైనా అర్థం చేసుకుంటారా? అని ఇంకొందరు ప్రశ్నించారు.వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.అలాగే పట్టాలపై ట్రైన్ వస్తుంటే అది వెళ్లేంతవరకు ఆగి ఆ తర్వాతే పట్టాలు దాటి పోయేలాగా జాగ్రత్త పడండి.
ఉన్నది ఒకటే జీవితం కాబట్టి కాస్త ఆలస్యమైనా జాగ్రత్తగా ఇంటికి చేరుకోవడం పైనే దృష్టి పెట్టండి.