చైనాలో పుట్టిన కరోనా వైరస్ రోజు రోజుకు ప్రపంచంలో విస్తరిస్తూ వణికించేస్తుంది.ఇంతటి ప్రళయం సృష్టిస్తున్న కరోనా కారణంగా ఇప్పటికే 3 లక్షల మంది మృతి చెందగా,42 లక్షల మంది కి పైగా కరోనా బారిన పడ్డారు.
అయితే కరోనా మహమ్మారి జంతువులలో కూడా కనిపించిన విషయం తెలిసిందే.ఆమధ్య న్యూయార్క్ లోని ఒక జూ లో మూడు పులులకు కరోనా పాజిటివ్ అని తేలింది.
అయితే ఈ మహమ్మారి పండ్ల లో కూడా వస్తుందట.అదేంటి పండ్ల కు కరోనా లక్షణాలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుండడం తో ఇటలీ,జర్మనీ,స్పెయిన్,ఫ్రాన్స్,ఇంగ్లాండ్,అమెరికా వంటి దేశాలకు చైనా కరోనా కిట్లను సరఫరా చేసింది. అయితే ఆ కరోనా కిట్లు నాసిరకం అని సరిగా పనిచేయడం లేదని ఇప్పటికే నిరూపణ అయ్యింది.
అయితే ఇవే కిట్లను టాంజానియా కు కూడా చైనా అందించడం తో అవి సరిగా పని చేస్తున్నాయో లేదో అని టెస్ట్ చేయడం కోసం ఈ కిట్లను మనుషుల పై కాకుండా గొర్రె, మేక, జాక్ ఫ్రూట్, పాపయా, ఇంజిన్ ఆయిల్ వంటి వాటిని శాంపిల్స్ గా తీసుకొని పరీక్షించారు.విచిత్రంగా ఈ శాంపిల్స్ లో కొన్ని పాజిటివ్ గా తేలడంతో టాంజానియా షాక్ అయ్యింది.
ఈ విషయాన్ని టాంజానియా అధ్యక్షుడు స్వయంగా చెప్పడం విశేషం.గత కొద్దీ నెలలుగా ఈ కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి.
కరోనా నుంచి బయటపడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటి వరకు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, కరోనా ఉదృతి మాత్రం తగ్గడం లేదు.కరోనా కోసం ఇప్పటికే 100 కు పైగా కంపెనీలు పనిచేస్తున్నాయి.ఈ ఏడాది చివరి వరకు ఈ మహమ్మారికి మెడిసిన్ కనుగొనాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.