అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన సైకిల్పై దేశాన్ని చుట్టివస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య. ఆశా మాలవ్యను ప్రత్యేకంగా అభినందించిన సీఎం వైఎస్ జగన్, ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్ష, రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి.సైకిల్పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని సీఎంకి వివరించిన ఆశా మాలవ్య.
మధ్యప్రదేశ్లోని రాజ్ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్యాత్ర నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు.ఆశా మాలవ్య కృషిని ప్రశంసించిన సీఎం.ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య, ఇతర సీఎంవో అధికారులు.