హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి( Huzurabad MLA Kaushik Reddy )పై క్రిమినల్ కేసు నమోదైంది.ఈ మేరకు ఆయనపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 7వ తేదీన కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సమక్షంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో( BRS Meeting ) పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు నమోదు చేస్తున్న కేసుల నేపథ్యంలో.డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి కామెంట్స్ తో పోలీసుల మనో భావాలు దెబ్బతిన్నాయని కరీంనగర్ కు చెందిన పురుషోత్తం, ఆశీష్ గౌడ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.