కరోనా ఎక్కడ చూసినా,ఎవరి నోట విన్నా కూడా ఈ కరోనా పేరే వినిపిస్తుంది.సామజిక దూరం పాటించకపోతే ఈ కరోనా మహమ్మారి ఒక్కరి వల్ల ఎంతమందికి వ్యాపిస్తుందో అందరికి తెలిసిందే.
అందుకే వీరికి వైద్యం అందిస్తున్న వైద్యులు,వీరిని వెతికి పట్టుకుంటున్న పోలీసులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎదో రకంగా ఈ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఎవరూ బయటకు రావద్దు అని ఇండ్లలోనే ఉండమని లాక్ డౌన్ విధించి మరి ప్రభుత్వాలు కోరుతున్నప్పటికీ జనాలు మాత్రం రోడ్లపై తిరుగుతూ ఒకరి వల్ల నలుగురు ఈ మహమ్మారి బారిన పడే పరిస్థితులు తీసుకువస్తున్నారు.
ఇలాంటివారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.అలానే కరోనా పాజిటివ్ తేలిన వారిని హాస్పిటల్ కు తరలించాలి అన్నా కూడా పెద్ద రిస్క్ గా పోలీసులకు తయారైంది.
ఈ నేపథ్యంలో చండీఘడ్ పోలీసుల చేతిలో కొత్త పరికరం ఒక్కటి అందుబాటులోకి వచ్చింది.ఇంతకీ ఆ పరికరం ఏంటంటే ‘కరోనా ట్రాపర్’.
దీని సాయంతో పోలీసులు లాక్డౌన్ ఉల్లంఘులు లేదా కరోనా వైరస్ అనుమానితుల వద్దకు వెళ్లకుండానే దూరం నుంచి పట్టేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్లను వ్యాన్ లేదా అంబులెన్సు ఎక్కించేయవచ్చు.
ఈ పరికరాన్ని ‘కరోనా ట్రాపర్’ అని అంటారు.డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ బనివాల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించారు.
దీనికి సంబందించిన ఒక వీడియో ను కూడా ఆ అధికారి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఆ వీడియో లో స్వీయ నిర్బంధానికి నిరాకరించిన ఒక వ్యక్తి ని పోలీసులు ఈ కరోనా ట్రాపర్ ని ఉపయోగించే పట్టుకొని అంబులెన్స్ లో బంధించారు.
ఈ కరోనా ట్రాపర్ వల్ల కరోనా అనుమానితులతో పోలీసులు సామజిక దూరం పాటించే అవకాశం ఉంటుంది.