రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్లో సంక్షోభం ముగింపు చేరుకుంది అనుకునే సమయంలో కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. మణిపూర్లో మరో రాజకీయ సంక్షోభం తలెత్తింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.ఎమ్మెల్యేలు వారి రాజీనామాలను నేరుగా స్పీకర్కు పంపించారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ శాసన సభ్యుడు హెన్రీ సింగ్ ప్రకటించారు.తన పార్టీ నేత ఓ లబోబి సింగ్ నాయకత్వంపై తమకు నమ్మకం లేదని.
అందుకే తాము రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని హెన్రీ సింగ్ విమర్శించారు.సోమవారం అసెంబ్లీ సమావేశం ముగియగానే ఆ అరుగురు ఎమ్మెల్యేలతో స్పీకర్ సమావేశమయ్యారు.
ఆ అరుగురు ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను స్పీకర్ పరిశీలించినట్లు సింగ్ పేర్కొన్నారు.కాగా, రాజీనామా లేఖలను స్పీకర్ ఇంకా ఆమోదించలేదని హెన్రీ సింగ్ తెలిపారు.
రాజీనామా చేసిన వారిలో హెన్రీ సింగ్తో పాటు ఓనమ్ లుఖోయ్, ఎండీ అబ్దుల్ నాసిర్, పానమ్ బ్రోజెన్, నాగమాతంగ్ హాకిప్, గిన్సువాన్ వావ్ ఉన్నారు.