కాంగ్రెస్‎కు మరో షాక్: ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా..!

రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్‎లో సంక్షోభం ముగింపు చేరుకుంది అనుకునే సమయంలో కాంగ్రెస్‎కు మరో షాక్ తగిలింది. మణిపూర్‎లో మరో రాజకీయ సంక్షోభం తలెత్తింది.

 Congress, Manipur, Six Mlas Resign, Rajasthan,-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.ఎమ్మెల్యేలు వారి రాజీనామాలను నేరుగా స్పీకర్‎కు పంపించారు.

ఈ విషయాన్ని కాంగ్రెస్ శాసన సభ్యుడు హెన్రీ సింగ్ ప్రకటించారు.తన పార్టీ నేత ఓ లబోబి సింగ్ నాయకత్వంపై తమకు నమ్మకం లేదని.

అందుకే తాము రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని హెన్రీ సింగ్ విమర్శించారు.సోమవారం అసెంబ్లీ సమావేశం ముగియగానే ఆ అరుగురు ఎమ్మెల్యేలతో స్పీకర్ సమావేశమయ్యారు.

ఆ అరుగురు ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను స్పీకర్ పరిశీలించినట్లు సింగ్ పేర్కొన్నారు.కాగా, రాజీనామా లేఖలను స్పీకర్ ఇంకా ఆమోదించలేదని హెన్రీ సింగ్ తెలిపారు.

రాజీనామా చేసిన వారిలో హెన్రీ సింగ్‎తో పాటు ఓనమ్ లుఖోయ్, ఎండీ అబ్దుల్ నాసిర్, పానమ్ బ్రోజెన్, నాగమాతంగ్ హాకిప్, గిన్సువాన్ వావ్ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube