అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది.హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే అధికార టీఆర్ఎస్ బీజేపీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
ఈ నెల 15 తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వారికి సమాచారం అందినట్లు తెలుస్తోంది.అంతే కాకుండా ఆగస్టులో ఈ ఉప ఎన్నికను నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న సుమారు 50 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది.ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం వెలువడాల్సిన నోటిఫికేషన్ కరోనా కారణంగా ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
ఇక హుజురాబాద్ పోటీకి సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి.మొన్నటి వరకు పోటీలో లేని కాంగ్రెస్ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అప్పగించడంతో లైమ్ లైట్ లోకి వచ్చింది.
త్వరలో బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర కూడా చేస్తానని ప్రకటించడంతో హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కాయి.ఇన్నాళ్లు నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కూడా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పజెప్పడంతో ఎక్కడ లేని ఉత్సాహంతో పోటీకి సిద్ధమవుతోంది.
కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ ల అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం.
కాగా ప్రస్తుతం జరుగుతున్న జలజగడాలతో ఏమైనా నష్టం వాటిల్లుతుందా… అని అధికార టీఆర్ఎస్ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి దాన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందట.నిన్న మొన్నటి వరకు అక్టోబర్ లోనే హుజురాబాద్ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయని భావించిన పార్టీలు ప్రస్తుతం ఆగస్టులోనే ఈ ఎన్నికలు జరుగుతాయని నమ్ముతున్నారు.
ఎన్నికల్లో