టాలీవుడ్లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కు, ముదురు హీరోయిన్ ఛార్మీకి ఉన్న రిలేషన్ గురించి గత యేడాదిన్నరగా లెక్కకు మిక్కిలిగా వార్తలు వస్తున్నాయి.పూరి పర్సనల్ మ్యాటర్స్లోకి కూడా ఛార్మీ ఎంటర్ అవ్వడం.
అది పూరి ఫ్యామిలీలో చిచ్చు పెట్టినట్టు కూడా టాక్ ఉంది.ఇదిలా ఉంటే పూరి-నితిన్ కాంబోలో ఓ సినిమా స్టార్ట్ అయ్యి కూడా ఆగిపోయింది.
ఈ సినిమా వ్యవహారాలన్ని ఛార్మీయే చూసుకుంటుందని పూరి చెప్పడంతో నితిన్ ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యిందన్న ప్రచారం కూడా ఉంది
ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య 101వ సినిమాకు పూరి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా ఛార్మీ జోక్యం బాగా ఎక్కువవుతోందట.
పూరి లేటెస్ట్ మూవీ రోగ్ దారుణంగా బోల్తా కొట్టడంతో ఇక పూరి మీద జనానికి నమ్మకం పోయింది.ఇక పూరి బ్రాండ్ మీదే సినిమాను ఎక్కువ రేట్ పెట్టి కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు.
బాలయ్య శాతకర్ణి హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో జనాలకు, ట్రేడ్ వర్గాలకు ఇదే కాస్త ఆశగా ఉంది
అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయ్యింది.ఏరియాల వారీగా ఛార్మీ చెపుతోన్న రేట్లు చూసి ట్రేడ్ వర్గాలు, బయ్యర్లు పరారైపోతున్నారట.
క్రిష్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ తీసిన శాతకర్ణి సినిమా రేట్ల కంటే ఛార్మీ ఈ సినిమాకు ఎక్కువ రేట్లు చెపుతోందట.అంత రేటు తాము పూరిని చూసి పెట్టలేమని బయ్యర్లు తెగేసి చెపుతున్నారట
ఇక ఓవర్సీస్లో అయితే ఈ సినిమాకు ఇప్పటకీ క్రేజే లేదట.
ఏదేమైనా ఛార్మీ ఇన్వాల్మెంట్ ఈ సినిమాకు అసలుకే మోసం తెచ్చేలా ఉందన్న టాక్ కూడా వస్తోంది.మరి ఈ విషయంలో బాలయ్య జోక్యం చేసుకుంటాడేమో చూడాలి.