తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బండి సంజయ్ అరెస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీస్తున్నారు.
ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసిన అమిత్ షా.ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది.అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర నాయకత్వం నుంచి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారని సమాచారం.ఈ మేరకు తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతలు అందరూ అత్యవసర సమావేశం కావాలని ఆయన సూచించారు.
అందుకు కావాల్సిన కార్యాచరణ వెంటనే సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారని సమాచారం.