విజయవాడ: బిజెపి మహిళా రాష్ట్ర మోర్చా మరియు బిజెపి రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామిని ప్రెస్ మీట్.కేంద్ర బడ్జెట్ అంటే రాష్ట్రానికి ఇంత అని కేటాయింపులు కాదు, దేశవ్యాప్తంగా అవసరాలను బట్టి ఏ ఏ రంగాలకు ఎంత ఎంత కేటాయించాలో ఆలోచన చేసి, ఆ రంగాలకు కేటాయింపులు ఉంటాయి.
ఈ విషయం రాజకీయ పార్టీలకు తెలుసు, అయినా కుయుక్తితో బిజెపి పై బురద చల్లాలని, ఆలోచనతో బడ్జెట్ మీద ఆరోపణ చేస్తున్నారు.రాబోవు 25 సంవత్సరాల లో మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలన్న ఆలోచనతో ప్రధాని మోడీ ఉంటే,
అమృత కాల్ బడ్జెట్ను రూపొందించి నిర్మల సీతారామన్, ప్రధాని ఆలోచనలను ఆచరణలోకి తెచ్చారు.మహిళలకు, బాలికలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధి కోసం 2500 కోట్లు పోషణ అభియాన్ కేటాయించడం జరిగింది.పచ్చికామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడిందన్న చందంగా, రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వంపై, బిజెపిపై కుయుక్తితో ఆరోపణలు చేస్తున్నారు.వీటిని నేడు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.
దేశ అభివృద్ధి, సంక్షేమంలో బిజెపి ప్రభుత్వం దూసుకెళ్తుంది.