సినిమా స్టోరీ లో దమ్ము ఉండాలి , కంటెంట్ బాగుండాలి , కధలో అవసరమైతే డ్యూయల్ రోల్స్ చేయడానికి సిద్దపడుతుంటారు , మన హీరోస్ ఇక మన హీరోస్ చేసే వైవిధ్యమైన రోల్స్ కోసం ఎంతైనా కష్టపడుతుంటారు .ఓక సెట్ ఆఫ్ ఆడియెన్స్ చూస్తే మాస్ సినిమాలను ఎక్కువ ఇష్టపడుతుంటారు , మరొకరు క్లాస్ సినిమాలను ఇష్టపడుతుంటారు , ఫైనల్ గా ఏదిఏమైనా సినిమా అనేది వినోదం కోసమే .
సినిమాలు చూసే విధానములో ప్రేక్షకులు అభిరుచి ఎప్పటికి అప్పుడు మారుతూ వస్తుంది .ఎప్పుడు ఒకే రకమైన సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు డ్యూయల్ రోల్స్ ఇప్పుడు ట్రెండ్ గా మారింది .ఒకప్పుడు క్యారెక్టర్స్ లో డిఫెరెంట్ వేరియేషన్స్ ని చూపిస్తూ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసేవారు మన హీరోస్ .ఇపుడు అలా కాదు , డ్యూయల్ రోల్ చేసి ప్రేక్షకులకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు .
ఇక అసలు విషయానికి వస్తే .ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ టైమ్ చాలా బాగుంది .2010 లో డైరెక్టర్ బోయపాటి శ్రీను -బాలకృష్ణ కాంబినేషన లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ సింహా .ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .ఇక సింహ మూవీ కన్నా ముందు బాలకృష్ణ చేసిన సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం అందుకోలేకపోయాయి .సింహా మూవీ విజయంతో బాలకృష్ణ టైమ్ మొదలైయింది .ఇక సింహా మూవీ సక్సెస్ తరువాత బాలయ్య బాబు చేసిన పరమ వీర చక్ర ,శ్రీరామరాజ్యం, అధినాయకుడు ,ఊ.కొడతారా ఉలిక్కిపడతారా , శ్రీమన్నారాయణ సినిమాలు , బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపోయాయి .ఇక సింహ మూవీ ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు , బాలయ్య బాబు ని స్క్రీన్ మీద ఏలా ప్రెజెంట్ చెయ్యాలో ఒక్క డైరెక్టర్ బోయపాటి శ్రీను కె తెలుసు , మల్లి 2014 లో వీరిద్దరి కాంబినేషన్ లో లెజెండ్ సినిమా తెరెక్కింది ,ఈ మూవీ లో కూడా బలకృష్ణ డ్యూయల్ రోల్స్ లో వైవిధ్యమైన నటన కనపరిచి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు .ఇక్కడ కామన్ పాయింట్ ఏమిటంటే … బాలయ్య బాబు చేసిన సింహా , లెజెండ్ సినిమాల్లో డ్యూయల్ రోల్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట అయ్యారు , అలానే ఈ డ్యూయల్ రోల్స్ కు ప్రేక్షకులు భ్రమ్మ రధం పట్టారు.
ఇక మెయిన్ పాయింట్ కి వస్తే .2019 లో డైరెక్టర్ బోయపాటి శ్రీను – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ మూవీ బాక్స్ -ఆఫిస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .ఇక ఈ మూవీ తరువాత మల్లి బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా అఖండ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .ఇక ఈ మూవీ లో బాలకృష్ణ హై వోల్టేజ్ యాక్టింగ్ , యాక్షన సీన్స్ , సాంగ్స్ , డైరెక్టర్ బోయపాటి శ్రీను టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది .ఇక ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ గా అఘోర గాను ,మురళి కృష్ణ గాను రెండు వేరియేషన్స్ చుపించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు .బాలకృష్ణను డ్యూయల్ రోల్స్ లో చూడటానికి అభిమానులు బాగా ఇష్టపడుతున్నారు .గత కొంతకాలం నుంచి నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ సూపర్ హిట్లు ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి ఒకప్పుడు రొటీన్ కథలతో హిట్ అనే పదానికి దూరమైన బాలకృష్ణ ఇక ఎప్పుడు మాత్రం ఇక ప్రేక్షకులకు మాస్ పూనకాలు తెప్పించే కథలతో థియేటర్లలో గర్జిస్తున్నాడు అని చెప్పాలి.ఈ క్రమంలోనే గత ఏడాది అఖండతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య ఇక ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు.
ఇదిలా ఉంటే ఇక బాలయ్యను సినిమాల్లో సింగిల్ గా మాస్ గా కనిపించే బాలయ్య ను సింగిల్ రోల్ గా చూడటానికి వీలు కాదు అనే భావన ప్రేక్షకులలో కలుగుతుంది .గతంలో వచ్చిన అఖండ సినిమాలో కూడా డబుల్ రోల్ చేసి హిట్టు కొట్టాడు.ఇక ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో కూడా వీరసింహారెడ్డి, జై సింహారెడ్డి అనే రెండు పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు.వీరసింహారెడ్డి సినిమా తరువాత బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .ఇక ఈ సినిమా గురుంచి సోషల్ మీడియా లో రోజుకో అప్ డేట్ వినిపిస్తుంది .ఇక అనిల్ మూవీ లో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .బాలకృష్ణ ను డ్యూయల్ రోల్ లో చూపించడానికి ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది .ఇక ఈ డ్యూయల్ రోల్ కు బాలయ్య నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లు తెలుస్తోంది.మరి మొత్తానికి ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ – బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా అనే విషయం మీద క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేంతవరకు ఎదురు చూడాలసిందే .