అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ వెండితెర అరంగ్రేటం చేసి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
సినిమాల పరంగా బిజీ అవుతున్న ఈ నటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.నిత్యం తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు కునుకు లేకుండా చేస్తున్నారు.
తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.సరిగ్గా పెళ్లి వయసు లేకున్నప్పటికీ పెళ్లి గురించి బోలెడన్ని కలలు కంటుందని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా జాన్వికపూర్ మాట్లాడుతూ తన పెళ్లి ఎక్కడ జరగాలని ఉందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.తన పెళ్లిని ఎప్పటికైనా తిరుపతిలో చేసుకోవాలనేది తన కోరిక అని ఈ సందర్భంగా తెలియజేశారు.
పెళ్లి మండపం అలంకరణ ఆ విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.తన పెళ్లి మండపం మల్లెపువ్వులు, కొవ్వొత్తులతో చాలా సాంప్రదాయబద్ధంగా అలంకరించి ఉండాలని, తన పెళ్లిలో కాంచీపురం పట్టు చీరను కట్టి,డైమండ్ జ్యువలరీ వేసుకొని, రెండు రోజుల పాటు తన పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఈ చిన్నది కలలు కంటోంది.ఈ క్రమంలోనే పెళ్లి గురించి ఎన్ని కలలుకంటున్న జాన్వికపూర్ కు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే ప్రశ్న ఎదురవడంతో.తెలివైన వాడైతే చాలు అని తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.