టీఆర్ఎస్ కార్పొరేటర్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.భయంతో ఆ కార్పొరేటర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తల దాచుకున్నాయి.
విషయం తెలిసి ఆ గ్రామస్థులు స్కూల్ వెళ్తుంటే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఉధృతంగా మారిన పరిస్థితిని పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేశారు.
ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని ఒకటో డివిజన్ లో చోటు చేసుకుంది.టీఆర్ఎస్ కార్పొరేటర్ రామ్మూర్తినాయక్ ఇంటిపై కైకొండాయి గూడెం గ్రామస్థులు దాడికి దిగారు.గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడి కొద్ది రోజుల కిందట మరణించాడు.మృతితో డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ హస్తం ఉందని తెలిసి గ్రామ ప్రజలు మండిపోయారు.
కార్పొరేటర్ గ్రామానికి వచ్చాడని తెలుసుకుని గుంపులుగా తరలెత్తారు.ఇంటి ముందు విధ్వంసం సృష్టించారు.
పార్క్ చేసిన వాహనాన్ని రాళ్లతో, రాడ్లతో కొట్టి ధ్వంసం చేశారు.బయట జరుగుతున్న అల్లర్లకు భయపడి కార్పొరేటర్ స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకున్నాడు.ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకున్నాడని గ్రామస్థులకు తెలియడంతో అక్కడి గ్రామస్థులు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులను అడ్డుకుని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకుని గ్రామస్థులకు శాంతిపజేశారు.ఈ మేరకు కార్పొరేటర్ ను ఇంటికి తరలించారు.
గ్రామస్థులను కూడా అక్కడి నుంచి పంపించేశారు.ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.