1.బంగ్లాదేశ్ యువతి అరెస్ట్
వీసా గడువు ముగిసినా హైదరాబాద్ లోని కవాడిగూడ లోనే ఉండిపోయిన బంగ్లాదేశ్ యువతి హాకీ (23) ని గాంధీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
2.ఆదిలాబాద్ కాల్పుల ఘటన.వ్యక్తి మృతి
అదిలాబాద్ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ మృతి చెందాడు.ఎం ఐ ఎం జిల్లా అధ్యక్షుడు , మాజీ వైస్ చైర్మన్ ఫారు క్ అహ్మద్ ( 48) కొద్ది రోజుల క్రితమే ఈ కాల్పులకు పాల్పడ్డాడు.
3.వీడని పులుల భయం
కొమరం భీమ్ జిల్లా ప్రజలకు ఇంకా పెద్ద పులి భయం వీడలేదు.ఇద్దరు గిరిజనులను హతమార్చిన తరువాత పులులు కనిపించకుండా పోయాయి.వీటి కోసం అటవీ శాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేసినా పులుల ఆచూకీ లేదు.
4.రజనీకాంత్ కు అస్వస్థత
ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.రక్తపోటు, హెచ్చుతగ్గుల కారణంగా ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
5.అమెరికాలో బాంబు పేలుడు
అమెరికాలోని నాష్ విల్లే డౌన్ టౌన్ లో శుక్రవారం పేలుడు సంభవించింది.ఈ ఘటనలో కొన్ని ఇళ్లు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.దీనిపై ఎఫ్ బీ ఐ దర్యాప్తు మొదలుపెట్టింది.
6.‘ ఆయుష్ మాన్ భారత్ ప్రారంభం
జమ్ము కాశ్మీర్ లో ఆయుష్మన్ భారత్ పథకాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
7.విశాఖలో 144 సెక్షన్
వైసీపీ టీడీపీ నేతల మధ్య వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
8.కరోనా డ్రై రన్
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించేందుకు కేంద్ర నాలుగు రాష్ట్రాల ను ఎంచుకుంది.డిసెంబర్ 28 29 తేదీల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించబోతోంది.ఆంధ్ర ప్రదేశ్ , పంజాబ్, గుజరాత్ , అసోం రాష్ట్రాలలో ఈ డ్రై రన్ నిర్వహించబోతున్నారు.
9.యూకే నుంచి వచ్చిన ఎనిమిది మంది కరోనా
యూకే నుంచి కేరళకు వచ్చిన ఎనిమిది మందికి కరోనా పాజిటివ్శా గా నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య మంత్రి శైలజ వెల్లడించారు.
10.ఏపీలో ఇద్దరికి కొత్తరకం వైరస్
లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కొత్త కరుణ లక్షణాలు ఉండడంతో వారిని నెల్లూరులోని జిజిహెచ్ కోవిడ్ ఆస్పత్రిలో చేర్చారు.
11.మహేష్ కు బాలీవుడ్ స్టార్ ప్రశంస
సూపర్ స్టార్ మహేష్ బాబు ఉద్దేశిస్తూ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పోస్ట్ పెట్టారు.మహి తో కలిసి పని చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
12.టీకా తీసుకున్న సౌదీ రాజు
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం కోవిడ్ టీకా వేయించుకున్నారు.
13.మాస్క్ ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
ఢిల్లీలోని మై పూరి ప్రాంతంలో ఓ మాస్కులు తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
14.తిరుమలలో శ్రీవారి భక్తుల ఆందోళన
తిరుమలలో శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు ఆలయ సిబ్బంది తమ తోసేశారు అంటూ భక్తులు ఆరోపించారు.శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన తమను బంగారువాకిలి నుంచి వెనక్కి పంపేశారు అంటూ భక్తులు నిరసన తెలిపారు.
15.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.తెలంగాణలో కరోనా
తెలంగాణ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.కాంగ్రెస్ లో వీ హెచ్ వ్యాఖ్యల దుమారం
టీ పిసిసి అధ్యక్ష పదవి ఎంపికపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో విహెచ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యదర్శి బోస్ రాజ్ ను ఠాకూర్ నివేదిక కోరారు.
18.చిత్తూరు జిల్లాలో తుపాకీ కాల్పులు
చిత్తూరు జిల్లాలో నాటు తుపాకితో జరిపిన కాల్పుల కలకలం రేపాయి.ఫోన్ నాటు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో శాంతిపురం లో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
19.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,700
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,940
20.కోవిడ్ 19 టీకా .వైద్యుడికి అలర్జీ
వాషింగ్టన్ లో మోడెర్నా covid 19 వ్యాక్సిన్ స్వీకరించిన ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.