ఉడుకు రక్తానికి తొందర ఎక్కువ అంటారు.నిజమేనేమో ! 21 ఏళ్ల అఖిల్ తొందరపాటు వల్లే మొదటి సినిమా చెడగోట్టుకున్నాడా ?
నిజానికి ఇప్పుడప్పుడే అఖిల్ ను లాంచ్ చేయాలని నాగార్జున భావించలేదట.కాని అఖిల్ తొందరపాటు చేయడంతో నాగార్జున కూడా సరే అనాల్సివచ్చింది.అఖిల్ కోసం నాగార్జునతో పాటు, ఆయన చెల్లెలు నాగాసుశీల చాలా కథలు విన్నారు అయితే ఏది నచ్చకపోవడంతో సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.
మొదట త్రివిక్రమ్ తో లాంచ్ చేయిస్తే బాగుంటుందని నాగార్జున భావించారు.త్రివిక్రమ్ అయితే, మరీ నాటుగా వెళ్ళకుండా, ఇటు క్లాస్ ఆడియెన్స్ కి నచ్చేలా తీస్తారని, దానితో యూత్ కి నచ్చే అంశాలు పెడుతూనే, మరోవైపు మాస్ ఆడియెన్స్ ను కుడా సంతృప్తిపరిచేది త్రివిక్రమ్ ఒక్కరే అని నాగార్జున భావించారు.
కాని త్రివిక్రమ్ అప్పటికే అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి కమిట్ అయ్యి ఉన్నారు.కొన్ని రోజులు ఆగుదాం అని నాగార్జున అంటే తండ్రి మాట వినలేదట అఖిల్.
వినాయక్ గారికి కమిట్ మెంట్స్ లేవు చేసేద్దాం అని ఒప్పిచడానికి ప్రయత్నాలు చేస్తుండగా, తోడుగా నితిన్ వచ్చి, తోలి చిత్రం తోనే మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తే కమర్షియల్ హీరోగా ఎదుగుతారు, దానికి వినాయక్ గారే కరెక్ట్ అని ఫోర్స్ చేయడంతో , అటు అఖిల్, ఇటు నితిన్ మాట కాదనలేక ఒప్పేసుకున్నారు నాగార్జున.అఖిల్ తొందరపాటు వల్లే పూర్తిగా ప్రిపేర్ అవకుండానే సినిమా మొదలు పెట్టేసారు.
ఇప్పుడు అదే బెడిసికొట్టింది.