ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు ఈ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు ( Rouse Avenue Court )విచారణ చేపట్టనుంది.

 Afternoon Hearing On Mlc Kavitha's Bail Petition , Bail Petition, Mlc Kavitha,-TeluguStop.com

లిక్కర్ పాలసీ ఈడీ మనీలాండరింగ్ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.తనపై అక్రమంగా కేసు పెట్టారని, ఈ వ్యవహారంలో తన పాత్రకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.

అఫ్రూవర్స్ గా మారిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులో ఇరికించారని ఆమె తెలిపారు.అయితే లిక్కర్ కేసులో కవితే కింగ్ పిన్ అని ఈడీ ఆరోపిస్తుంది.

ఈ క్రమంలోనే ఆమె బయటకు వెళ్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేసే అవకాశమున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరుతుంది.ఈ క్రమంలో కవితకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా ? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube