మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో ఆచార సంప్రదాయాలను పాటిస్తాం.అందులో భాగంగానే కొన్ని పద్ధతులను ఫాలో అవుతుంటాం.
అందులోనూ ఆడ పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు మన పెద్దలు.అందుకు కారణం ఆడ పిల్లలే రేపటి తరాన్ని భూమి మీదకు తీసుకు వచ్చే అమ్మలు.
అయితే మనకు తెలియకుండా మనం చేసే కొన్ని పనుల వల్ల సంతాన సమస్యలను ఎదుర్కో వలసి వస్తుంది.అయితే అమ్మాయిలు అస్సలే జంట అరటి పండ్లు తిన కూడదని చెబుతుంటారు.
అందులోనూ గర్భిణీలు అస్సలే అలా తినకూడదు అంటారు.అయితే ఇలా తినొచ్చా.
తిన కూడద మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన పురాణాలు, గ్రంథాల ప్రకారం జంట పండ్లను ఇవ్వడం తప్పా కాదా అనే అంశం గురించి ఎక్కడా లేదు.
కానీ మామూలు కంటే తేడాగా కనబడే పండ్లను దేవుడికి సమర్పించడం మంచిది కాదని మాత్రం వివరించబడింది.ఆ ఉద్దేశాన్నే కొందరు వక్రీకరించడంతో… జంట పండ్లను తినొద్దనే విషయాన్ని తీసుకొచ్చారు.
దాని వల్లే మన పెద్దలు కలిసి ఉన్న పండ్లను తినకూడదని చెబుతుంటారు.అయితే అవకాశం ఉన్నంత వరకూ దోషం లేని పండ్లు ఏ తేడా లేని పండ్లనే దేవుడికి సమర్పించాలి.
అలాగే మనం కూడా తినాలి.అయితే తప్పని సరి పరిస్థితుల్లో సమర్పించాల్సి వచ్చిన మనం తినాల్సి వచ్చినా తప్పేం లేదు.
వీటిని తినడం వల్ల ఎలాంటి సమస్యలు, దోషాలు ఏర్పడవని వేద పండితులు సూచిస్తున్నారు.