చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.షేక్పేట్ మండలంలో మూడు స్ధలాల్లో ఇష్టం వచ్చిన స్ధలాన్ని కోరుకోవాలని సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ గతంలో సూచించారు.
దీంతో వారి కోరిక మేరకు బంజారాహిల్స్లో ఇంటి స్ధలం కేటాయించారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా ఉన్న రూ.20 కోట్ల విలువైన 711 గజలా స్థలాన్ని సంతోష్ కుటుంబానికి కేటాయించారు.బుధవారం ఆ స్ధలాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు.
అనంతరం స్థలానికి సంబంధించిన పత్రాలను సంతోష్ భార్యకు అందజేశారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్తో పాటు పలువురు పాల్గొన్నారు.
సంతోష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల ఎక్స్గ్రేషియాతో పాటు ఇంటి స్థలం, సంతోష్ భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.గత నెల 22వ తేదీన సంతోష్ కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సంతోష్ భార్యకు ఆమె పేరిట రూ.4 కోట్ల చెక్కును అందజేశారు.ఇప్పటికే గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేయగా.
బుధవారం ఇంటి స్ధలం పత్రాన్ని అందజేశారు.