తెలుగులో ఎవడు సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటించిన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్.సౌత్ లో ఐ, రోబో సీక్వెల్ లో కూడా నటించి శంకర్ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న అమీ జాక్సన్ హాలీవుడ్ సూపర్ విమెన్ వెబ్ సిరిస్ లో నటిస్తూ ఇండియన్ సినిమాలకి దూరమైంది.
అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకి దగ్గరగా ఉంటూ వస్తుంది.చాలా కాలంగా ఈ జార్జ్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇంకా వీరిద్దరికీ పెళ్లి కాకున్నా తాజాగా ఓ బిడ్డకి తల్లైంది.
కొద్ది రోజుల క్రితం బేబీ బాయ్ కి జన్మనిచ్చిన అమీ జాక్సన్ మాతృత్వాన్ని ఆశ్వాదిస్తుంది.
దీనికి సంబందించిన ఫోటోలని తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.ఇక తన కొడుకుకి ఆండ్రియాస్ అని పేరు కూడా పెట్టేసింది.
ఇక తన బాయ్ ఫ్రెండ్ ని వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది.అమీ జాక్సన్ ఇన్స్టాగ్రామ్లో తన కొడుకు ఫోటోలని షేర్ చేసి, తాను ఎంతగా మాతృత్వాన్ని ఆశ్వాదిస్తుందో చూపించింది.
ఈ రోజు 4 నెలల వయస్సు ఉన్న నా బిడ్డ మీ ముందు జీవితం ఎలా ఉందో గుర్తుంచుకోవడం చాలా కష్టం.నువ్వు చాలా అద్భుతమైన చిన్నవాడివి, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను”.
అంటూ కొడుకుతో ఫోటోలతో పాటు కామెంట్స్ పెట్టింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.