తెలుగు సినిమా పరిశ్రమ లో తగు జాగ్రత్తలు తీసుకుని మసలుకునే నిర్మాతలలో అల్లూ అరవింద్ కూడా ఒకరు.తన సినిమా నిర్మాణ విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అందరికీ తెలిసిందే.
గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే తెలుగు సినిమా చరిత్ర లో మంచి పేరున్న సంస్థ.కానీ ఈ మధ్య వారి నుంచి ఎలాంటి సినిమాలూ రావడం లేదు.
కొత్తగా ఏర్పడిన గీతా ఆర్ట్స్ 2 నుంచే సినిమాలు వస్తున్నాయి.ప్రస్తుతం అల్లు అరవింద్ నిర్మాణంలో తన ఇద్దరు తనయుల సినిమాలు వస్తుండటం విశేషం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న సినిమా సరైనోడు.బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటుగా బన్ని స్టైలిష్ నటనతోడై వస్తున్న ఈ సినిమాలో బన్ని ఓ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడని టాక్.
ఇక ఇదే బ్యానర్లో అల్లు వారి రెండో వారసుడు అల్లు శిరీష్, పరశురాం దర్శకత్వంలో చేస్తున్న సినిమా సెట్స్ మీదుంది.లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
అల్లు అరవింద్ ఈ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్ జెమిని వారికి భారీ మొత్తంగా అమ్మాడని తెలుస్తుంది.
ప్రస్తుతం క్రేజ్ దృష్ట్యా అల్లు అర్జున్ టాప్ హీరోల్లో ఒకడిగా ఉండటం చేత తన సినిమా భారీగానే శాటిలైట్ అయ్యే అవకాశం ఉంది.
ఇక ఎటుకూడి అల్లు శిరీష్ అంతగా ప్రేక్షకుల్లో గుర్తింపు రాబట్టుకోలేకపోయాడు కాబట్టి తన సినిమాను అల్లు అర్జున్ సినిమాతో కలిసి తెగ్గొట్టేశాడు అల్లు అరవింద్.అయితే రెండు సినిమాలను జెమిని వారు 15 కోట్లకు తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
అల్లు అర్జున్ సినిమాతో పాటుగా శిరీష్ సినిమాను రైట్స్ వదిలిన అరవింద్ కు ఏమాత్రం లాభం చేకూరుతుందో చూడాలి.