రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, చనిపోవడం సమస్యలకు పరిష్కారం కాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.కర్నాటకలోని కరువు ప్రాంతాల్లో రాహుల్ రెండు రోజులుగా పర్యటిస్తున్నారు.
తెలంగాణ, మహారాష్ట్ర, మరి కొన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే కర్నాటక కరువు ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది.
రాహుల్ తన పాద యాత్రలో రైతు కుటుంబాలతో మాట్లాడారు.అనేక మంది రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని రాహుల్ని వేడుకున్నారు.
తను ప్రధానమంత్రిని కాదని, తాను పరిష్కరించలేనని అన్నారు.కాని ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పారు.
ఇక్కడి రైతుల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియదు.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవడంలేదని అనుకోవాలి.
రైతులకు అన్ని దారులు మూసుకుపోయాక వారికి తెలిసిన పరిష్కారం ప్రాణాలు తీసుకోవడమే.కాని వారి నిస్సహాయ స్థితిని ప్రభుత్వాలు అర్ధం చేసుకోవడంలేదు.