అక్కినేని ప్రిన్స్ అఖిల్ తన మొదటి సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.రెండు సంవత్సరాల పాటు ప్రేక్షకుల ముందుకు ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ ఊరించిన అఖిల్ మరింత లేటు చేయవద్దనే ఉద్దేశ్యంతో షూటింగ్ను చకచక పూర్తి చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువ హీరో నితిన్ దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటి వరకు పలు దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు.
తాజాగా ఈ సినిమా థాయిలాండ్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది.ఈ షెడ్యూల్లో పలు యాక్షన్ సీన్స్తో పాటు కొన్ని సన్నివేశాలను సైతం దర్శకుడు వినాయక్ చిత్రీకరించాడు.
అఖిల్ను మాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లుగా వినాయక్ చెబుతున్నాడు.థాయిలాండ్ షెడ్యూల్తో ఈ సినిమా దాదాపుగా 100% చిత్రీకరణ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
మిగిలిన బ్యాలన్స్ షూటింగ్ను అతి త్వరలో పూర్తి చేసి అక్టోబర్లో దసరా పండుగకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనల్లో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది.