కేంద్రంలో కమలం వికసించి ఇంకా ఏడాది కూడా గడవలేదు….ఇంతలోనే వ్యతిరేక పవనాలు దేశం అంతటా వ్యాపించాయి.
అందులోనూ ముఖ్యంగా బడ్జెట్ విషయంలో సీమాంధ్రకు జరిగిన అన్యాయానికి కమలం పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పేలా లేదు…ఇక ఇప్పటివరకూ.అది చేస్తాం.
ఇది చేస్తాం…అంత చేస్తాం…ఇంత చేస్తాం అంటూ డప్పులు కొట్టిన వెంకయ్య ఇప్పుడు విలేఖరులు ప్రశ్నలు అడుగుతుంటే మాటలు వెతుక్కుంటున్నారు.కేంద్రం అన్యాయంపై విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించడంతో వెంకయ్యకు పలుమార్లు కోపం పీక్స్ కు వెళ్ళింది.
అదే క్రమంలో ఆయన బదులిస్తూ… మీరు ఎన్నిరకాలుగా ప్రశ్నించినా.నేను చెప్పేది ఇదే అంటూ.
ఒక దశలో మీడియా వైఖరిపై వెటకారంగా మాట్లాడారు.మీరు అడగదలుచుకున్నది అడిగారు.
నేను చెప్పదలుచుకున్నది చెప్పాను.ఇంతకు మించి నా నుంచి మీరు ఏమీ రాబట్టలేరు.
మీకు అర్థమయ్యేలా చెప్పి ఉండకపోతే…అది నా అసమర్థత అని అనుకోండి.అంటూ కుండ బద్దలు కొట్టేసారు.
మరి ఎన్నాళ్ళిలా తప్పించుకుంటారో చూడాలి.