చిత్తూరు జిల్లా( Chittoor district ) ఐరాల మండలంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి.చుక్కవారిపల్లిలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు అరటి, మామిడి మరియు చెరుకు పంటలను ధ్వంసం చేశాయి.
అనంతరం చుక్కవారిపల్లి( Chukkavaripalli ) అటవీ ప్రాంతంలో గజరాజుల గుంపు తిష్ట వేసింది.ఏనుగుల సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అటవీ శాఖ అధికారులు( Forest Department officials ) స్పందించి తమను, తమ పంట పొలాలను గజరాజుల బారినుంచి కాపాడాలని కోరుతున్నారు.