రాజన్న సిరిసిల్ల జిల్లా: దీపావళి పండుగ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణం నిర్వాహకులు మున్సిపల్ అధికారుల నిబంధనలను అనుసరించకుండా తమ ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తూ దుకాణ సముదాయాల ముందు టెంట్లను ఏర్పాటు చేసుకున్నారు.అయితే అధికారుల నిబంధనల ప్రకారం 10 నుంచి 12 గజాల స్థలాన్ని మాత్రమే ఆక్రమించుకొని దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి.
కానీ నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలతో పాటు దుకాణాల ముందు కూడా భారీ టెంట్లను వేసుకొని అధికారుల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.అయితే టెంట్ల ద్వారా ప్రధాన సమస్య.
అనుకొని అగ్ని ప్రమాదం సంభవిస్తే దీని ద్వారా నష్టం మరింత ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుందని వెంటనే వేసినటువంటి టెంట్లను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.