ఇంద్రకీలాద్రి లో ఏడవ రోజుకి చేరుకున్న దసరా శరన్నవరాత్రి వేడుకలు..

ఏడో రోజు లలితా త్రిపుర సుందరీ దేవి( Lalitha Tripura Sundari Devi )గా దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు…ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం.అమ్మవారి అలంకారాలలో లలితా త్రిపుర సుందరీ దేవి కి ప్రత్యేకత ఉంది.

 Dussehra Sarannavaratri Celebrations Reached Seventh Day In Indrakiladri , La-TeluguStop.com

త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలవబడుతోంది.శ్రీదేవి యే శ్రీ చక్ర అధిష్టాన శక్తి గా పంచదశాక్షరీ మహా మంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తుల్ని ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది.

లక్ష్మీ దేవి , సరస్వతిదేవి( Lakshmi Devi ) ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో భక్తిపావనాన్ని చిందే చెరుకుగడను చేతబట్టుకుని శివుని వృక్ష స్థలం పై కూర్చుని దేవి దర్శనమిస్తుంది.దర్శన సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా , అమ్మవారు త్రిపురసందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube