తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ విడుదలకానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో యాభైకి పైగా అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయిందని ఆ పార్టీ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సామాజిక న్యాయం పాటిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగానే సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసినట్లు ఆయన తెలిపారు.తొలి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు.
అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డారు.ఢిల్లీలో కవిత ధర్నాలు చేసింది కానీ మహిళలకు సీట్లు ఇవ్వలేదని విమర్శించారు.