విశాఖ పరిపాలన రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ విశాఖకు రావడానికి మూడు రాజధానుల బిల్లు పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు.
ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పాలన చేయవచ్చని మంత్రి అమర్నాథ్ అన్నారు.అనంతరం త్వరలోనే విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పాలన చేస్తారని తెలిపారు.
ఇందుకోసం ఆయన నివాసం కూడా విశాఖకు షిఫ్ట్ అవుతారని పేర్కొన్నారు.పవన్ కల్యాణ్ విస్సన్నపేట సందర్శిస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు.
పవన్ ను రైతులు అడ్డుకున్నా తమకు సంబంధం లేదని వెల్లడించారు.